జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1 నుంచి 10వ తరగతుల విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలను ఆన్లైన్లో పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పుస్తకాల పీడీఎఫ్లను cse.ap.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.