ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

55చూసినవారు
ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
ఏపీలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదు. కానీ మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్టంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 216 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్