మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయించాలని వాలంటీర్లకు సూచించారు. వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలని, వైసీపీ పట్ల కోపంగా ఉన్నవారు ఓటు వేయకుండా చూడాలని మంత్రి ధర్మాన కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా హాట్టాపిక్గా మారాయి.