IPL-2024లో తమ హోమ్ గ్రౌండ్ లో ఆడాల్సిన మ్యాచులను ఢిల్లీ జట్టు విశాఖలో ఆడనుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో WPL జరగనుండటమే ఇందుకు కారణం. ఫైనల్, ఎలిమినేటర్ సహా WPL సెకండ్ హాఫ్ మ్యాచులన్నీ అక్కడే జరగనున్నాయి. వరుస మ్యాచ్ల వల్ల పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉందని, దాంతో ఢిల్లీ మైదానానికి కొంత రెస్ట్ ఇచ్చి DC ఆడే తొలి రెండు మ్యాచులను విశాఖలో నిర్వహిస్తున్నారు. మార్చి 31న CSK, ఏప్రిల్ 3న KKRతో DC తలపడనుంది.