జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

82చూసినవారు
జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా.’ అంటూ ఎక్స్‌లో మంగళవారం పోస్టు పెట్టారు. పరిపాలన వైఫల్యాలతోనే ప్రజలు మాజీ సీఎం జగన్‌ను తిరస్కరించారంటూ లోకేష్ పేర్కొన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థల్ని, వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్