రాయలసీమలోని రోడ్లపై గడ్కరీకి మంత్రి వినతిపత్రం

53చూసినవారు
రాయలసీమలోని రోడ్లపై గడ్కరీకి మంత్రి వినతిపత్రం
AP: అన్న‌మ‌య్య(D) మదనపల్లిలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప‌ర్య‌టించారు. ఆదినాథ్ శ్రీగురు మహావతార్ బాబాజీ ఆలయ ప్రాణప్రతిష్ఠలో ఆయ‌న పాల్గొన్నారు. రాష్ట్రానికి వ‌చ్చిన గడ్కరీకి రాయలసీమలోని రోడ్ల అభివృద్ధిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వినతిపత్రం అందించారు. రాజంపేట-రాయచోటి- కదిరి స్టేట్ హైవేను నేషనల్ హైవేగా మార్చాలని, కడప-రాయచోటి రోడ్‌ను 4 లైన్లకు విస్తరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్