గుంటూరు జిల్లా మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఇటీవలే వైసీపీని వీడి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజులకే తిరిగి వైసీపీలోకి చేరడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.