అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో ఆదివారం దారుణం జరిగింది. పాత ఇంజరం గ్రామానికి చెందిన శివ సుబ్రహ్మణ్యం తన కూతురిని కత్తితో నరికేశాడు. దాంతో మాదాసు రాణి (28) తీవ్రంగా గాయపడింది. దాడి అనంతరం శివ సుబ్రహ్మణ్యం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.