అసెంబ్లీ సమావేశాల ముందు రోజున సీఎం చంద్రబాబు నాయుడును బిజేపి ఎమ్మెల్యేలు కలిసినట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి శుక్రవారం చరవాణి ద్వారా ఆదోని విలేకరులకు తెలిపారు. ఆదోనిలో సిబిఐ విచారణ జరపాలని, రాష్ట్రంలో మద్యం, ఇసుక కుంభకోణంపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. అభివృద్ధికి సహకరించాలని కోరామన్నారు.