ఆదోనిలో పత్తి ధర పతనం
By W. Abdul 75చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, వేరుశనగ గరిష్ట ధరలు రూ. 7, 471, రూ. 6, 440, కనిష్ట ధరలు రూ. 4, 002, రూ. 5, 049, మధ్య ధరలు రూ. 7, 219, రూ. 6, 337 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం మార్కెట్కు పత్తి 230, వేరుశనగ 43 క్వింటాళ్లు వచ్చిందన్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి సంబంధిత కమీషన్ ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు.