తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పరిమితం చేయాలని ఎస్టీయు ఏపి రాష్ట్ర సహా అధ్యక్షులు సి నాగరాజు, రాష్ట్ర కౌన్సిలర్ వీరచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకరించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.