నిష్పక్షపాతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మిగులు ఉపాధ్యాయుల గుర్తింపు, పని సర్దుబాట్లు జరిగేలా చూడాలని ఏపిఎంటిఎఫ్ పట్టణ నాయకులు జంగం బసవరాజు, కోటన్న అన్నారు. శనివారం ఆదోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ పని సర్దుబాటు చేస్తే ప్రాధమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పరిరక్షించుకోవచ్చన్నారు.