ఆళ్లగడ్డ మండల పరిధిలోని గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలను తీసుకోవడం జరిగిందని ఆళ్లగడ్డ మండల అభివృద్ధి అధికారి ఏవి వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండల పరిధిలో గల పలు గ్రామాలను పరిశీలించామని కొన్ని గ్రామాలలో పాడైన బోర్లను తిరిగి మరమత్తు చేయించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రజలు నీటిని వృధాగా వదిలివేయకుండా పొదుపుగా వాడు కోవాలని సూచించారు.