మహిళలను రాళ్లతో కొట్టారు (వీడియో)

59385చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ కుటుంబంపై సోమవారం రాళ్ల దాడి జరిగింది. బాధిత కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు 50 మంది వరకు వచ్చారు. ఆ దుండగులు బాధిత కుటుంబంపై రాళ్లు విసిరారు. కర్రలతో కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆ కుటుంబం అక్కడి నుంచి పరుగులు తీసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్