నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: నంద్యాల ఎస్పీ

84చూసినవారు
నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి కేంద్ర సాయుధ బలగాలు, పోలీస్ సిబ్బందితో కలిసి ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బుధవారం కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్