వినాయక నిమజ్జనోత్సవంలో ఎస్సై డ్యాన్స్

85చూసినవారు
కోడుమూరు మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనం బుధవారం వైభవంగా జరిగింది. వాహనంపై విగ్రహాలను కొలువుంచి వీధుల గుండా ఊరేగించారు. మండలంలోని అమడగుంట్ల, పాలకుర్తి గ్రామాల్లో ఎస్సై శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఊరేగింపులో ఎస్సై డ్యాన్స్ చేసి యువకులను ఉత్సాహపరిచారు. అనుగొండలో వేలంలో లడ్డూను రూ. 22వేలకు క్రిష్ణ అనే యువకుడు కైవసం చేసుకున్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్