కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేదాకా ఉద్యమిస్తామని సీఐటీయూ మండల కార్యదర్శి జిపి వీరన్న అన్నారు. ఆదివారం కోడుమూరులోని పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మాట్లాడారు. కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి చేస్తున్నారని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీంతో కర్నూలు కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు.