కౌతాళం మండలంలోని వివిధ గ్రామాల్లో జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీఓ రఘునంధన్ గుప్తా శుక్రవారం తెలిపారు. వృద్ధులు, వితంతువులు , వికలాంగులు , హిజ్రాలు , డయాలసిస్ పింఛనుదారులకు 1న ఇంటి వద్దకే పింఛన్లు అందించడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. మండలంలో 30 పంచాయతీల్లోని 8, 719 పింఛనుదారులకు మొత్తం రూ. 5, 96, 78, 000 అందిస్తామని తెలిపారు.