మంత్రాలయం నియోజకవర్గంలో కొంతమంది జనసేన పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అందుకు సహించేది లేదని, వారి పబ్బం గడుపు కోవడానికి నాపై లేనిపోని అసత్యపు ఆరోపణలు చేసే వారికి ఇదే నా తుది హెచ్చరిక అని మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ వాల్మీకి లక్ష్మన్న మండిపడ్డారు. గురువారం రాఘవేంద్ర నగర్ లోని స్వగృహం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు హాజరయ్యారు.