నీట మునిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి: సిపిఐ డిమాండ్..

82చూసినవారు
నందికొట్కూరు నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల పంట నీటిలో మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఐ జిల్లా నాయకులు ఎం. రమేష్ బాబు అన్నారు. జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో శనివారం రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారని, ప్రతి ఎకరాకు 50 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్