పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ

54చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ
విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యం శ్రమిస్తూ కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరీశ్వర్ రెడ్డి, మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్