నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోకుల్ కృష్ణ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ల సమక్షంలో నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని 38వ వార్డు వైఎస్ నగర్ కి చెందిన 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి గోకుల్ కృష్ణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని కోరారు.