మిద్దె శాంతి రాముడిని కలిసి మద్దతు కోరిన మాజీ మంత్రి ఫరూక్

1936చూసినవారు
మిద్దె శాంతి రాముడిని కలిసి మద్దతు కోరిన మాజీ మంత్రి ఫరూక్
నంద్యాల లోని ఆర్జియం, శాంతిరామ్ మెడికల్ కళాశాల అధినేత మిద్దె శాంతి రాముడిని మాజీమంత్రి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికలలో టిడిపికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ శాంతి రాముడికి, నాకు మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. వారి వెంట టిడిపి నాయకులు విశ్వనాధ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్