వర్షాకాలంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి

75చూసినవారు
వర్షాకాలంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షాకాలంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో వరి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్నాయని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏఈఓ శ్రీనివాసరెడ్డి, గ్రామ వ్యవసాయ అధికారి మధు, నాగ శేఖర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్