శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ సేవ

73చూసినవారు
శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్