శ్రీశైలం ఆలయానికి రూ. 3. 87కోట్ల హుండి ఆదాయం

54చూసినవారు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మ వార్ల హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. భక్తులు 15 రోజులలో సమర్పించిన కానుకల్లో రూ. 3, 87, 52, 761 నగదుతో పాటు 263 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 9 కేజీల 700 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ ఆదాయంగా చేకూరినట్లు ఈవో పేర్కొన్నారు. పటిష్టమైన భద్రతా, మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్