మల్లన్న సన్నిధిలో సుప్రీంకోర్టు జడ్జి

80చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ రాజగోపురం వద్ద అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా రత్నగర్భ వినాయక స్వామి దర్శనం అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్