దివ్యాంగ విద్యార్థులకు నారా లోకేశ్ ల్యాప్‌టాప్‌లు గిఫ్ట్

75చూసినవారు
దివ్యాంగ విద్యార్థులకు నారా లోకేశ్ ల్యాప్‌టాప్‌లు గిఫ్ట్
AP: మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు విడుద‌ల చేసిన జీవో-225 వ‌ల్ల ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. ఈ క్ర‌మంలో వారంతా తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని లోకేశ్‌ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేశ్‌ అభినందించడంతోపాటు వారికి ల్యాప్‌టాప్‌లను బ‌హుమ‌తిగా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్