భవన నిర్మాణ కార్మికులకు నారా లోకేష్ కీలక హామీ

72520చూసినవారు
భవన నిర్మాణ కార్మికులకు నారా లోకేష్ కీలక హామీ
భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికులతో నారా లోకేష్ భేటీ అయ్యి మాట్లాడారు. జగన్ పాలనలో మొదటి బాధితులు నిర్మాణరంగం కార్మికులేనని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేసి చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్