రెడ్ బుక్ పేరుతో అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బెదిరిస్తున్నారనే కేసులో ఏసీబీ కోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వారి పేర్లను రెడ్బుక్లో నమోదు చేసుకుంటున్నామని లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పారు. దాంతో కొందరు అధికారులు, ఉద్యోగులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.