ఏపీలో ముగ్గురికి జాతీయ అవార్డులు

76చూసినవారు
ఏపీలో ముగ్గురికి జాతీయ అవార్డులు
దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్నమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్న పలువురిని ఔట్‌లుక్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురికి అవార్డులు దక్కాయి. జాతీయ అత్యుత్తమ కేవీకేగా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఎంపిక కాగా ఆ కేంద్రం తరపున శాస్త్రవేత్త జి. ధనలక్ష్మి అవార్డును అందుకున్నారు. అనకాపల్లి కొందంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో సహజ పద్ధతిలో వ్యవసాయం, కూరగాయలు, బంతి పండిస్తున్న షేక్ యాకిరికి అవార్డు దక్కింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణ సహజ పద్ధతుల్లో మిల్లెట్స్‌తో బిస్కట్లు తయారు చేసి అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్