ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ఏఎస్పేట, అనంతసాగరం, మర్రిపాడు, సంఘం మండలాల్లో ఆదివారం మోస్తారు వర్షం కురిసింది. వర్షాలు పడటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వర్షాలు ఇలాగే పుష్కలంగా పడాలని ఆకాంక్షించారు. ఆదివారం నాటికి 16. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.