ఏపీలో ఘోరం.. బైక్‌పై మృతదేహం

1887చూసినవారు
ఏపీలో ఘోరం.. బైక్‌పై మృతదేహం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంబులెన్స్ అందుబాటులో రాకపోవడంతో మృతదేహాన్ని బైక్‌పై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజవొమ్మంగి మండలానికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో జడ్డంగిలోని ఆరోగ్య కేంద్రంలో మరణించింది. మృతదేహాన్ని ఆమె ఇంటికి తరలించడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నించగా.. రిపేర్లు రావడం వల్ల కొద్దిరోజులుగా మూలనపడినట్లు తేలింది. దీనితో మల్లికార్జున్ అనే వ్యక్తి మృతదేహాన్ని అయిదు కిలోమీటర్ల దూరం పాటు బైక్‌పై తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్