కందుకూరు నియోజకవర్గంలోని పలుచోట్ల ఆలయాల నిర్మాణాలకు సహకారం అందించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో మంత్రి రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నాగేశ్వరరావు కలిసి నియోజకవర్గంలోని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.