రాళ్లపాడు రిజర్వాయర్ ను సందర్శించిన కందుకూరు ఎమ్మెల్యే

71చూసినవారు
రాళ్లపాడు రిజర్వాయర్ ను సందర్శించిన కందుకూరు ఎమ్మెల్యే
లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్ ను శనివారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం సుమారు 15 అడుగుల నీరు చేరిందని అధికారులు ఎమ్మెల్యే కి తెలియజేశారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో రాళ్లపాడు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంకు నీరు చేరిన తర్వాత నీరు క్రిందకు విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్