పేద ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బడుగు, బలహీన వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి తో కలిసి కావలి మండలం ముసునూరులో శుక్రవారం ఆయన పర్యటించారు.