విడవలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972-73 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు గురువారం పాఠశాల ఆవరణలో కలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం చేశారు. విద్యార్థులకు అవసరమైన సైకిల్ స్టాండ్ ను పూర్వ విద్యార్థుల సహాయంతో నిర్మించారు. అలాగే వంకీ పెంచలయ్య పాఠశాలకు దాదాపుగా 50 ఫ్యాన్లు వితరణ చేశారని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.