నిమజ్జనంలో అపశృతి.. నీటిలో మునిగి ఒకరు దుర్మరణం (వీడియో)

67చూసినవారు
వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భవాని మాత విగ్రహాన్ని చెరువులో నిమర్జనం చేస్తుండగా నీట మునిగి ఒకరు మృతి చెందారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన భవాని మాత విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ మేరకు చెరువులో నిమర్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన అశోక్ కుమార్(40) అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లల వేదన కన్నీళ్ళు తెప్పిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్