కోవూరు: మంటల్లో పత్రాలు, నగదు దగ్ధం

71చూసినవారు
కోవూరు: మంటల్లో పత్రాలు, నగదు దగ్ధం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దూరులో నివాసం ఉంటున్న బేల్దారి మేస్త్రి రమణయ్య ఇంటిలో హై వోల్టేజ్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లోని వస్తువులు, ముఖ్యమైన పత్రాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. పూర్తిగా నష్టపోయిన తనను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితుడు ఆవేదన చెందాడు.

సంబంధిత పోస్ట్