గాంధీ ఆశ్రమంలో పొణకా కనకమ్మ జయంతి కార్యక్రమం

85చూసినవారు
ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో సోమవారం పొణకా కనకమ్మ 132వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు జాతీయ ఖ్యాతి తెచ్చిన ధీరవనిత పొణకా కనకమ్మ అని కన్వీనర్ కల్పనమ్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్