కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగానే చేరుతున్నా: పిండి సురేష్

64చూసినవారు
తనను నమ్మి 30 ఏళ్లు తన వెనక నడిచిన కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ పిండి సురేష్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేట కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఆయన సమక్షంలో చేరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్