నెల్లూరు ప్రజా సమస్యలపై సిపిఎం శాఖలో చర్చ

85చూసినవారు
నెల్లూరు ప్రజా సమస్యలపై సిపిఎం శాఖలో చర్చ
నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం 53వ డివిజన్ సిపిఎం శాఖా మహాసభ బుధవారం వెంకటేశ్వరంలో జరిగింది. ఈ మహాసభకు సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ బి, మూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పెన్నా నదికి పక్కనే వెంకటేశ్వరపురం ఉన్న ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ గిరిజన కాలనీ నుంచి వెంకటేశ్వర సెంటర్ కు అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్