అష్టోత్తర కళశాలలో శ్రీ చెంగాళమ్మకు అభిషేకం

70చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర కళశాలలో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 108 కళశాలను ఉంచి అందులో నదీ జలాలను, పలు రకాల సుగంద ద్రవ్యాలను నింపి శాస్త్రోక్తంగా మంత్ర పటనం చేశారు. మంగళ హారతుల అనంతరం వీటితో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్