జగనన్న పాలనలోనే రాష్ట్రంలో ఉన్న పేదలందరకీ సంక్షేమ పథకాలు అందాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. దొరవారిసత్రం మండలంలోని తనయాలి, బూదూరు, ఉచ్చూరు, వెదురుపట్టు, ఏకొల్లు, నెలబల్లి, ఆనేపూడి పంచాయతీల్లో సోమవారం శ్రీ చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.