నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, ఉదయగిరి, దుత్తలూరు, సీతారాంపురం, వరికుంటపాడు, కలిగిరి మండలాల్లో ఆకాశం చల్లబడింది. గత రెండు రోజుల నుంచి రాత్రి సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇదే నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఆకాశంలో మార్పులు చోటుచేసుకుని కారుమబ్బులను అలుముకుంది. కాగా రైతులు, ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇది వరకే ప్రకటించింది.