వెంకటగిరి పట్టణంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు నీరు అందడం లేదన్నారు. అలాగే కండలేరు జలాశయంలో మూడు టీఎంసీల నీరు నిల్వ ఉందని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటలకు నీరు అందించాలని, లేకపోతే రైతులు కోసం నిరాహార దీక్ష చేస్తానని తెలియజేసారు.