హైదరాబాద్లోని రామకృష్ణ మఠం, ఆర్యజనని సంయుక్తంగా 'ది సీక్రెట్ ఆఫ్ వర్క్' అనే పేరుతో జాతీయ స్థాయి క్విజ్ నిర్వహిస్తున్నాయి. కర్మయోగ పుస్తకం చదివితే ఈ క్విజ్లో సులభంగా గెలవొచ్చు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న యువతీయువకులు ఇందులో పాల్గొనవచ్చు. www.ajcontest.org వెబ్సైట్ ద్వారా ఈ నెల 15లోపు ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విజేతలకు రూ.30 లక్షలకు పైగా స్కాలర్షిప్ అందించనున్నారు.