త్వరలో నూతన ఐటీ పాలసీ: నారా లోకేష్

67చూసినవారు
త్వరలో నూతన ఐటీ పాలసీ: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించేందుకు త్వరలో నూతన ఐటీ పాలసీ తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్‌ను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో కంపెనీలకు కేటాయించేందుకు ఎంత మేర భూమి ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ‘ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ’ విధానాలతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్