AP: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలిలను నియమించినట్లు ఈసీ వెల్లడించింది.