కాకినాడ జిల్లాలో న్యూఇయర్ వేడుకల్లో
టీడీపీ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. తునిలో యనమల రాజేష్, యనమల కృష్ణుడు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్న రాజేష్ వర్గాన్ని కృష్ణుడు వర్గం అడ్డుకోవడంతో.. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతకాలంగా ఇరువర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి.